News February 26, 2025
కేసీఆర్కు కిషన్ రెడ్డి పార్ట్నర్: CM రేవంత్

TG: KCRకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అని CM రేవంత్ అన్నారు. ‘KCR కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారు. నాకు పేరొస్తుందని మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు. SLBC టన్నెల్ ప్రమాదంపై మాట్లాడుతూ ‘పదేళ్ల నుంచి పనులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో 30కి.మీ మేర టన్నెల్ పూర్తయింది. తర్వాత తనకు లాభాలు రావడం లేదని KCR పనులను ఆపేశారు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 27, 2025
అఫ్గాన్ విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో అఫ్గాన్ ఓడిపోయేలా కనిపించినా, చివరి 2 ఓవర్లలో ఆ జట్టు బౌలర్లు ఇంగ్లండ్ వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పారు. దీంతో ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ENG 317కు ఆలౌటైంది. ENG బ్యాటర్లలో రూట్ (120) సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది.
News February 27, 2025
Vi, ఎయిర్టెల్ కస్టమర్లను ఆకర్షిస్తున్న BSNL ఆఫర్

లాంగ్టర్మ్ వ్యాలిడిటీతో BSNL అందిస్తున్న ఓ ఆఫర్ వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోందని సమాచారం. 336 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 24GB డేటా, రోజుకు 100 ఫ్రీ SMSలు, ఇతర ఫీచర్లను BSNL రూ.1499కే అందిస్తోంది. 24GB ముగిశాక 40kbps స్పీడుతో ఉచితంగా నెట్ పొందొచ్చు. ప్రస్తుతం వి, ఎయిర్టెల్ 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ను రూ.1849కి అందిస్తుండటంతో కస్టమర్లు ఆలోచిస్తున్నారు.
News February 26, 2025
రాజంపేటకు పోసాని కృష్ణమురళి తరలింపు

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేటకు తరలిస్తున్నారు. రేపు రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచనున్నారు. YCP హయాంలో FDC ఛైర్మన్ హోదాలో పోసాని TDP నేతలను అసభ్యంగా దూషించారని రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్3(5) కింద కేసులు నమోదయ్యాయి. కులాల పేరుతో దూషించారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.