News February 26, 2025
ఎగ్జామ్ టైమ్ అంటే లవర్స్ లేచిపోయే వేళ!

బిహార్లో బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీంతో పేరెంట్స్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటారా! ఇది లేచిపోయే టైమ్ కాబట్టి! ఇక్కడి పరీక్షల్లో పాసవ్వడం ఈజీ కాదు. పాసవ్వకుంటే అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లిచేసేస్తుంటారు. అందుకే ఎగ్జామ్పై డౌటుంటే ఎవర్నో చేసుకొనే బదులు తమ లవర్స్తో నుదుటున బొట్టు పెట్టించుకొని లేచిపోతారు. రీసెంటుగా ఓ యువతికి అబ్బాయి పాపిట సింధూరం పెట్టడం వైరల్గా మారింది.
Similar News
News February 27, 2025
TODAY HEADLINES

* ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం: CM రేవంత్
* సీఎం రేవంత్కు ప్రధాని మోదీ కీలక సూచనలు
* SLBC TUNNEL: రంగంలోకి BSF నిపుణులు
* సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్
* తెలంగాణ వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు జమ
* 36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR
* మార్చి 7న ‘ఛావా’ తెలుగు వెర్షన్ రిలీజ్
* విమాన ప్రమాదంలో 46కు చేరిన మరణాలు
* ఇంగ్లండ్పై అఫ్గానిస్థాన్ సంచలన విజయం
News February 27, 2025
పోసానిపై పలు జిల్లాల్లో కేసులు

AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్, లోకేశ్ను అసభ్యకరంగా దూషించారని బాపట్ల, అనంతపురం, నర్సరావుపేట, చిత్తూరు(D) యాదమరి, తిరుపతి(D) పుత్తూరు, మన్యం(D) పాలకొండ, కర్నూలు, శ్రీకాకుళంలో ఫిర్యాదులు అందగా, కొన్నిచోట్ల కేసులు నమోదయ్యాయి. 2 రోజుల క్రితం అన్నమయ్య(D) ఓబులవారిపల్లె పీఎస్లో నమోదైన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
News February 27, 2025
అఫ్గాన్ విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో అఫ్గాన్ ఓడిపోయేలా కనిపించినా, చివరి 2 ఓవర్లలో ఆ జట్టు బౌలర్లు ఇంగ్లండ్ వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పారు. దీంతో ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ENG 317కు ఆలౌటైంది. ENG బ్యాటర్లలో రూట్ (120) సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది.