News February 26, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతం చేద్దాం: వరంగల్ సీపీ

ఎన్నికల నిబంధనలను అమలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. ఎన్నికల సందర్బంగా సీపీ అధికారులతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు నిఘా పెట్టాలని సీపీ అధికారులకు సూచించారు.
Similar News
News November 4, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

సత్యసాయి (D) చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐచర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు.
News November 4, 2025
బియ్యం స్మగ్లింగ్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: జేసీ

ఏలూరు జిల్లాలో పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. హమాలీలు, రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్లోడింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సోమవారం ఆయన సూచించారు. ధాన్యం రవాణాలో లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు మంచి ఫలితాలు సాధించాలని జేసీ అభిషేక్ గౌడ ఆకాంక్షించారు.
News November 4, 2025
VZM: ఈ సంక్రాంతికీ కష్టాలు తప్పేలా లేవు..!

ఉత్తరాంధ్ర వలస జీవులకు ఈ ఏడాదీ సంక్రాంతి కష్టాలు తప్పేలా లేవు. చెన్నై, బెంగళూరు, HYD, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే వారు సంక్రాంతికి సొంతూళ్లకు చేరుకుంటారు. ఆయా ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు రైళ్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో బస్సులను ఆశ్రయించేవారు. అయితే ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతుండటంతోపాటు స్త్రీశక్తి పథకం కారణంగా బస్సులు ఎక్కేందుకు జంకుతున్నారు. రైళ్ల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.


