News February 26, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు: ఎస్పీ

image

జిల్లాలోని గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ రూపేష్ బుధవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండాలని పేర్కొన్నారు. కేంద్రాల సమీపంలో ప్రచారం చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 27, 2025

నిర్మల్ : చెట్టుపై నుంచి పడి వ్యక్తి దుర్మరణం

image

నిర్మల్‌ గాంధీ పార్క్ సమీపంలో పెరిగిన చెట్ల కొమ్మలను కొట్టేందుకు చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని వాల్మీకీనగర్‌కు చెందిన దూదేకుల కాసిం(47) చెట్ల కొమ్మలను కొట్టేందుకు చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడిపోగా గాయపడ్డారు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు.

News February 27, 2025

రాష్ట్ర పోలీస్ కబడ్డి మహిళ జట్టులో జిల్లా వాసికి చోటు

image

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామానికి చెందిన గోదావరి రాష్ట్ర పోలీసు కబడ్డి ఉమెన్స్ జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. ప్రస్తుతం గోదావరి నిజామాబాద్ పోలీసు డిపార్ట్మెంట్‌లో విధులు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారిణి ఎంపికవడంపై కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

News February 27, 2025

నేడే ‘MLC’ ఎన్నికల పోలింగ్

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సా.4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. TGలో ఉమ్మడి MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అటు APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

error: Content is protected !!