News February 26, 2025
NZB: చికిత్స పొందుతూ మహిళ మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈ నెల 23న ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మహిళ మృతి చెందింది. మృతురాలిని ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రఘుపతి సూచించారు.
Similar News
News January 22, 2026
నిజామాబాద్: ఇంటి వద్దే కేసు నమోదు.. మొదట ఇక్కడే

TG డీజీపీ ఆదేశాల మేరకు ఫిర్యాదు ఇంటి వద్దకు వెళ్లి పిటిషన్ను స్వీకరిస్తున్నామని NZB రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. తిర్మన్ పల్లికి చెందిన అశ్వినీ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. అయితే దుండగులు తాళం పగల కొట్టి 17 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, రూ.17 వేలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు సమాచారం మేరకు ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. మెుదటి సారి బాధితురాలి ఇంటికెళ్లి కేసు ఫైల్ చేశారు.
News January 22, 2026
NZB: గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు

త్వరలో జరగబోయే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీల అధినేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా 20 డివిజన్లలో MIM ప్రాధాన్యత ఉంది. మిగిలిన 40 డివిజన్లలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రభావితం చేసే అభ్యర్థుల కోసం ఇరు పార్టీలు స్క్రూటినీ చేస్తున్నాయి. అలాగే పలువురితో చర్చలు జరుపుతున్నారు.
News January 21, 2026
తెలంగాణ వర్సిటీ పీఆర్ఓగా డాక్టర్ కె.వి. రమణచారి

TU పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO)గా ఇంగ్లీష్ విభాగానికి చెందిన డాక్టర్ కె.వి. రమణచారి బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో పలు కీలక అడ్మినిస్ట్రేటివ్ పదవులు నిర్వహించిన రమణచారి.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు వీసీకి, రిజిస్ట్రార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వర్సిటీ అధికారులు ఆయనను అభినందించారు.


