News February 27, 2025
శుభ ముహూర్తం (27-02-2025)

☛ తిథి: బహుళ చతుర్దశి, ఉ.8.41 వరకు
☛ నక్షత్రం: ధనిష్ట, సా.4.28 వరకు
☛ రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
☛ యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48 వరకు, మ.2.48-3.36 వరకు
☛ వర్జ్యం: రా.11.21 నుంచి 12.52 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.7.42 గంటల నుంచి
Similar News
News February 27, 2025
ఆ 8 మంది చనిపోయి ఉంటారు: అధికారులు

TG: SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలపై అధికారులు ఆశలు వదులుకున్నారు. వాళ్లంతా టీబీఎం మెషీన్ చుట్టూ బురదలో కూరుకుపోయి చనిపోవచ్చని భావిస్తున్నారు. నిన్న ఆర్మీ రెస్క్యూ టీమ్ టన్నెల్ చివరివరకు వెళ్లి చూడగా ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ కనిపించలేదు. అక్కడ అత్యంత భయానక పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. శిథిలాలు తొలగిస్తే టన్నెల్ మళ్లీ కూలే ప్రమాదం ఉందంటున్నారు.
News February 27, 2025
ఎండోమెంట్ పరిధిలోకి చార్మినార్ ‘భాగ్యలక్ష్మీ’ అమ్మవారి ఆలయం

హైదరాబాద్లోని చార్మినార్ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ను ఎండోమెంట్ పరిధిలోకి తెస్తూ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. ఆలయానికి తక్షణమే ఈవోను నియమించాలని దేవాదాయశాఖ కమిషనర్ను ఆదేశించింది. యూపీకి చెందిన రాజ్మోహన్ దాస్ టెంపుల్పై ఆజమాయిషీ చెలయిస్తున్నాడంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది. ఆ వివాదం నడుస్తుండగానే ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆలయాన్ని దేవదాయ పరిధిలోకి తెస్తూ తీర్పునిచ్చింది.
News February 27, 2025
మహారాష్ట్రలో గోధుమపిండితో బట్టతల!

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ఇటీవల 300 మందికి జుట్టు రాలిపోయి చూస్తుండగానే బట్టతల వచ్చింది. దీంతో ప్రముఖ వైద్యుడు హిమ్మత్ రావ్ బవాస్కర్ రీసెర్చ్ చేసి, రొట్టెల తయారీకి వాడుతున్న గోధుమపిండిలో సిలీనియం అధికస్థాయిలో ఉండటమే బట్టతలకు కారణమని తేల్చారు. పంజాబ్, హరియాణాల నుంచి వచ్చిన పిండి బుల్ధానాలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయింది. ఆ రాష్ట్రాల్లోని పర్వత శ్రేణుల్లో సిలీనియం అధికంగా ఉంటుంది.