News February 27, 2025
సిరిసిల్ల: డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించిన కలెక్టర్

సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఏపీవో, పిఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లు, అధికారులు పోలింగ్లో ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కగా అందించాలని పేర్కొన్నారు.
Similar News
News February 27, 2025
చేనేత వస్త్రంపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో

AP: మంగళగిరికి చెందిన టీడీపీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ మంత్రి నారా లోకేశ్కు చేనేత వస్త్రాన్ని బహూకరించారు. దానిపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో ఉండటంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ‘మా కుటుంబసభ్యుల చిత్రాలతో వారు నేసిన చేనేత వస్త్రాన్ని బహూకరించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే వీళ్లు నియోజకవర్గంలో చేస్తున్న సామాజిక సేవకు సాయం అందిస్తాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
News February 27, 2025
సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో ఒకరి స్పాట్ డెడ్

శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని పెద్దనపల్లి క్రాస్లో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చాకలి ఆంజనేయులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అతడి తమ్ముడికి గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పెద్దనపల్లి గ్రామంలోని అతని తండ్రి నాగరాజుతో పాటు పలువురు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వ్యక్తిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.
News February 27, 2025
ఖమ్మం: నేడే పోలింగ్.. అంతా రెడీ!

నేడు జరగనున్న NLG, KMM, WGL టీచర్ MLC ఎన్నికల పోలింగ్కు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యాయి. 6,111 మంది ఓటర్లకు 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా BNS యాక్ట్ అమలు చేస్తున్నారు. భద్రతా రీత్యా సమస్యలు ఉంటే 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. బరిలో 19 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.