News February 27, 2025
చర్లపల్లి నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి నుంచి కాకినాడ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈనెల 28, మార్చి 7, 13, 21, 28ల్లో రాత్రి 7:20 చర్లపల్లి నుంచి రైలు (07031) బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4:30లకు కాకినాడకు చేరుకుంటుంది. మార్చి 2, 9, 16, 23, 31ల్లో సాయంత్రం 6:55 కాకినాడ నుంచి రైలు(07032) బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:50కు చర్లపల్లికి చేరుకుంటుంది.
Similar News
News November 15, 2025
IPL2026: అన్ని జట్ల రిటెన్షన్ జాబితా ఇదే

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిటెన్షన్ జాబితాను అన్ని జట్లు ప్రకటించాయి. SRH అభినవ్, అథర్వ, సచిన్ బేబీ, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడం జంపాను వదులుకుంది. కేకేఆర్ ఆశ్చర్యకరంగా ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, డికాక్ లాంటి స్టార్లను రిలీజ్ చేసింది. అన్ని టీమ్స్ పూర్తి జాబితాను పైన ఫొటోల్లో చూడండి.
News November 15, 2025
బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన iBOMMA నిర్వాహకుడు!

TG: కూకట్పల్లిలో <<18292861>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు. అతడు విశాఖ వాసి అని, విదేశీయులతో కలిసి హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. OTTకి వచ్చిన సినిమాలను వెంటనే పైరసీ చేసి సైట్లో పెట్టి, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేశాడని గుర్తించారు. సర్వర్ల పాస్వర్డులు సంపాదించారు. వందల హార్డ్డిస్కులు సీజ్ చేశారు. దీనిపై సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
News November 15, 2025
21న జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఈనెల 21న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో లక్ష్మణరావు తెలిపారు. కాకినాడ జడ్పీ కార్యాలయ హాలులో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాలకు అధికారులందరూ తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆయన శనివారం ఆదేశించారు.


