News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికకు విస్తృతస్థాయిలో బందోబస్తు: ఎస్పీ

అనకాపల్లి జిల్లాలో 27వ తేదీన జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు విస్తృతస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. బుధవారం మాట్లాడుతూ జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాల వద్ద 300 మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఎటువంటి టెంట్లు, స్టాల్స్ ఏర్పాటు చేయకూడదన్నారు.ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలన్నారు.
Similar News
News November 6, 2025
కశింకోట: 48 కిలోల గంజాయి పట్టివేత

కశింకోట మండలం అచ్చెర్ల జంక్షన్ వద్ద గురువారం 48 కిలోల గంజాయి (20 ప్యాకెట్లు) స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఈగల్ టీమ్ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, వైట్ మారుతి కారులో గంజాయిని గుర్తించామన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరొక వ్యక్తి పరారైనట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News November 6, 2025
అనకాపల్లి: ఈ నెల 11 నుంచి క్రీడల ఎంపిక పోటీలు

సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడల ఎంపిక పోటీలు ఈనెల 11 నుంచి 13 వరకు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం, షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్, పరవాడ ఇండోర్ స్టేడియం, అనకాపల్లి జార్జ్ క్లబ్ వద్ద నిర్వహించనున్నారు. ఈ వివరాలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజ గురువారం వెల్లడించారు. ఈ పోటీల్లో ఎంపికైన వారు ఈనెల 19 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
News November 6, 2025
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ మృతి

ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అనునయ్ సూద్(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఇన్స్టాలో వెల్లడించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. నోయిడాకు చెందిన అనునయ్ దుబాయ్లో ట్రావెల్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. 46 దేశాల్లో పర్యటించిన ఆయనకు ఇన్స్టాలో 14L, యూట్యూబ్లో 3.80L మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022, 23, 24లో ఫోర్బ్స్ ఇండియా టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.


