News February 27, 2025

చిన్న మెట్‌పల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

కోరుట్ల మండలం చిన్న మెట్‌పల్లి గ్రామానికి చెందిన మోత్కూరు సంజయ్ అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సంజయ్ చదువులో వెనక పడటంతో పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 27, 2025

వట్లూరు పెద్ద చెరువులో స్నానానికి దిగి ఇద్దరు మృతి

image

పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో గల పెద్ద చెరువులో ఇద్దరు వ్యక్తులు పడి గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు (58)చెరువులో మునిగిపోతున్న క్రమంలో.. కాపాడేందుకు యత్నించిన తమ్ముడి కుమారుడు సుబ్రహ్మణ్యం (32) మృతి చెందాడు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News February 27, 2025

Way2News ఎఫెక్ట్: గండిపాలెం గురుకులానికి అధికారుల పరుగులు 

image

ఉదయగిరి(M) గండిపాలెం గురుకులంలో 23న విద్యార్థులతో <<15553238>>వంటపనులు<<>> చేయిస్తున్న అంశంపై Way2Newsలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు. విద్యాశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు, జునైల్ కోర్టులో ఫిర్యాదు, AP కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆరా, బాలల సంరక్షణ కమిషనర్ విచారణ చకచకా జరుగుతున్నాయి. బాలల హక్కుల కమిషనర్ ఈ ఘటనపై మూడు రోజుల్లో నివేదిక కోరింది. మరి విద్యార్థులకు న్యాయం దక్కేనా.?

News February 27, 2025

ఎస్.రాయవరం: తాటి చెట్టు నుంచి జారిపడి యువకుడి మృతి

image

ఎస్.రాయవరం మండలం పి.ధర్మవరంలో బుధవారం తాటి చెట్టు ఎక్కి ఆకులు కోస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడి మృతి చెందినట్లు ఎస్ఐ విభీషణరావు తెలిపారు. పెనుగొల్లుకు చెందిన చిందాడ శ్రీను (27) కూలి పని కోసం తాటి చెట్టు ఆకులు కోసేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కి ఆకులు నరుకుతుండగా చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

error: Content is protected !!