News February 27, 2025
నిర్మల్: 109 మంది ఓటేశారు..!

నిర్మల్ జిల్లా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లాలో మొత్తం 149 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పోలింగ్ అధికారులు తెలిపారు.
Similar News
News February 15, 2026
చిరంజీవి సినిమాలో ‘ఛాంపియన్’ హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో <<18950253>>మరో సినిమా<<>> తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవర్ఫుల్ తండ్రి పాత్రలో చిరు కనిపించనున్నారని చర్చ జరుగుతోంది. కీలకమైన కూతురు క్యారెక్టర్ కోసం ‘ఛాంపియన్’ మూవీ హీరోయిన్ అనస్వర రాజన్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కృతి శెట్టి, సారా అర్జున్ పేర్లనూ పరిశీలించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
News February 15, 2026
మెదక్: 16న మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక

మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నికలను ఈనెల 16న పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉ.11 గంటలకు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మ.12:30 గంటలకు పరోక్ష పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. సమావేశానికి కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
News February 15, 2026
సింగరాయకొండ: డ్రోన్ల నిఘాలో బీచ్ ఫెస్టివల్

పాకల బీచ్ ఫెస్టివల్కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫెస్టివల్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల నిఘాలో ఉంటుందని ఆయన వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.


