News February 27, 2025
మారుమూల గ్రామాల్లో అల్లూరి ఎస్పీ పర్యటన

పెదబయలు మండలం మారుమూల జామిగూడా పంచాయతీ గుంజివాడ, చింతల వీధి గ్రామాలలో బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, ఏఎస్పీ ధీరాజ్ పర్యటించారు. గుంజివాడ గ్రామంలో శివరాత్రి సందర్భంగా జరుగుతున్న బాపనమ్మ బాలలింగేశ్వర దేవత జాతర సందర్భంగా దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలో గల తారాబు జలపాతాన్ని సందర్శించి సందడి చేశారు.
Similar News
News February 27, 2025
BIG ALERT: ఉ.11 తర్వాత బయటికి వెళ్లొద్దు

TGలో రానున్న 5 రోజులు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. MAR 2 వరకు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని తెలిపారు. నిత్యం 5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని చెప్పారు.
News February 27, 2025
వికారాబాద్ జిల్లా నేటి కార్యక్రమాలు

✓ పూడూరు: నేడు కంకల్ వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం.✓ దుద్యాల: నేడు పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకోనున్న పాలమూరు ఎంపీ డీకే అరుణ.✓ కొడంగల్: నేడు గాడిబాయి శివాలయంలో అన్నదాన కార్యక్రమం.✓ తాండూర్: నేడు భూకైలాస్లో పల్లకిసేవ, నేడు ఆయ నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్పీకర్.✓ పరిగి: నేడు బ్రహ్మసూత్ర శివాలయంలో శివపార్వతుల కళ్యాణం, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు.
News February 27, 2025
VMWD: స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖులు

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఘనంగా మహాశివరాత్రి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. లింగోద్భవ సమయంలో గురువారం వేకువ జామున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులతో పాటు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు అర్చకులు చేస్తున్నారు.