News February 27, 2025

మెదక్: అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి: DEO

image

మెదక్ జిల్లాలోని అన్ని బోర్డు స్కూల్స్ (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ)లో 2025-26 గాను 1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం ఆదేశించిందని డీఈవో రాధాకృష్ణ తెలిపారు. ద్వితీయ భాష- సింగిడి, తృతీయ భాష- వెన్నెల పుస్తకాలు బోధించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమన్యాలు దీనిని అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News July 10, 2025

MDK: ఇద్దరు మహిళలు అదృశ్యం.. కేసు నమోదు

image

కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. స్థానిక రెడ్డి కాలనీలో నివాసం ఉండే అక్కల అరుణ (27), ఆమె తోటి కోడలు అక్కల మౌనిక (26) మంగళవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 10, 2025

మెదక్: యాప్‌లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

image

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని డీఈవో రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.

News July 10, 2025

మెదక్: గుణాత్మక విద్య కోసం చొరవ చూపాలి: కలెక్టర్

image

నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం మెదక్ డైట్‌లో ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు మెరుగుకు సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో ఎఫ్ఎల్ఎన్ మానిటరింగ్ సమావేశం, ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు.