News February 27, 2025

వికారాబాద్ జిల్లా బుధవారం ముఖ్యంశాలు

image

✓ తాండూర్: భూకైలాస్ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి.✓ మర్పల్లి: డబ్బుల కోసమే వృద్ధురాలిని హత్య ముగ్గురు నిందితుల అరెస్ట్.✓ దామగుండం,బుగ్గ రామలింగేశ్వర స్వామి,పాంబండ రామలింగేశ్వర స్వామి,గాడిబాయి,భూకైలాస్ శివాలయాలకు పోటెత్తిన భక్తులు. ✓ వికారాబాద్ జిల్లాలో ఘనంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.✓ మహాశివుని ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఆశీస్సులతో

Similar News

News February 27, 2025

ఆ పేరు వింటే తెల్ల దొరల వెన్నులో వణుకు పుట్టేది!

image

బ్రిటిష్ పాలకులను గజగజలాడించిన చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి నేడు. 1906 జులై 23న మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలో జన్మించిన ఈయన.. చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. బ్రిటిషర్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. భగత్ సింగ్‌తో చేయి కలిపి అతని సాయుధ విభాగానికి కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు. 1931లో 24 ఏళ్లకే వీరమరణం పొందారు.

News February 27, 2025

పిల్లల్ని ఐసిస్‌లో చేర్చుతారా అంటున్నారు: ప్రియమణి

image

ముస్తాఫారాజ్ అనే వ్యక్తితో తన వివాహం జరిగినప్పుడు తనపై లవ్‌జిహాద్ ఆరోపణలు చేశారని నటి ప్రియమణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పుట్టబోయే పిల్లలని ఐసిస్‌లో చేరుస్తారా అంటూ కామెంట్లు చేయటం తనను బాధకు గురిచేస్తోందన్నారు. తన భర్తతో ఉన్న ఫోటో షేర్ చేస్తే 10లో 9నెగటివ్ కామెంట్లే ఉంటాయన్నారు. చాలా మంది కులం, మతం గురించే మాట్లాడతారని వాపోయారు. కాగా 2017లో ప్రియమణి, ముస్తాఫా మతాంతర వివాహం చేసుకున్నారు.

News February 27, 2025

పెద్దపల్లి జిల్లాలోని పోలింగ్ అప్డేట్

image

పెద్దపల్లి జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల పోలింగ్ 20.88% నమోదయింది. మహిళలు 2501, పురుషులు 3982, మొత్తం 6483 మంది ఓటు వేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 47.25% నమోదైంది. మహిళలు 212, పురుషులు313, మొత్తం 525 మంది ఓటు వేశారు.

error: Content is protected !!