News February 27, 2025
వరంగల్: విద్యార్థిని ఆత్మహత్య.. UPDATE

WGL నగరంలో ఉరేసుకొని బుధవారం <<15587387>>విద్యార్థిని ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన రేష్మిత WGL ములుగు రోడ్డులోని వ్యవసాయ విద్యాలయంలో ఫస్టియర్ చదువుతోంది. విద్యార్థినికి ఇంటిపై బెంగ ఉండటంతో అప్పుడప్పుడు తల్లి ఆమెతో పాటు హాస్టల్లో ఉండేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కాగా, నిన్న శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెల్లగా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Similar News
News January 7, 2026
NTR జిల్లాను రహదారి భద్రతలో నెం.1గా నిలపడమే లక్ష్యం: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాను రహదారి భద్రతలో నెం.1గా నిలుపుదామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా విజయవాడ ఎంజీ రోడ్–ఈట్ స్ట్రీట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రహదారి భద్రత వాక్థాన్ను ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.
News January 7, 2026
₹5800 CRతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు. గండిపేట నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 KM మేర నదిని సుందరీకరణ చేస్తారు. ముందుగా నదిలో పూడిక తీసి తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఆపై గోదావరి నీరు ప్రవహించేలా ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
News January 7, 2026
జోగి రమేశ్ను జైల్లో ఇబ్బంది పెడుతున్నారు: వెల్లంపల్లి

రాష్ట్ర ప్రజలు అందరూ ఈ అరాచక ప్రభుత్వాన్ని గమనిస్తున్నారని మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం విజయవాడలోని సబ్ జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్తో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాసరావు ములాఖాత్ అయ్యారు. 67 రోజులుగా బీసీ నాయకున్ని నిర్బంధించి జైల్లో నుంచి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. లోకేశ్ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు.


