News February 27, 2025
హనుమకొండ జిల్లాలో మహాశివరాత్రి అప్డేట్స్

✓ వేయి స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు
✓ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. Way2Newsతో ఛైర్మన్, అర్చకులు
✓ ఐనవోలు ఆలయంలో భక్తుల సందడి
✓ వంగర: శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్
✓ HNK: హయగ్రీవ చారి మైదానంలో మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
✓ HNK: పెళ్లికొడుకు రూపంలో దర్శనమిస్తున్న రుద్రేశ్వర స్వామి
Similar News
News February 27, 2025
Gold Cardతో భారతీయుల్ని నియమించుకోండి: ట్రంప్ ఆఫర్

US వర్సిటీల్లో గ్రాడ్యుయేట్లు అయ్యే భారతీయులను అమెరికన్ కంపెనీలు ఇకపై ‘గోల్డ్ కార్డు’ కింద నియమించుకోవచ్చని Prez డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘భారత్, చైనా సహా వేర్వేరు దేశాల నుంచి హార్వర్డ్ వంటి వర్సిటీలకు స్టూడెంట్స్ వస్తున్నారు. టాపర్లుగా అవతరించి జాబ్ ఆఫర్లు కొట్టేస్తున్నారు. వారు దేశంలో ఉంటారో లేదో తెలీదు కాబట్టి వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు. గోల్డ్ కార్డుతో ఆ ఇబ్బంది తొలగిపోతుంది’ అని అన్నారు.
News February 27, 2025
దుబ్బరాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

సారంగాపూర్ మండలంలోని పెంబట్ల-కోనాపూర్ గ్రామంలో కొలువైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేకువజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడెమొక్కులు, కుంపటి గజాశూలం మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భక్తులకు సరైన సౌకర్యాలు లేవని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News February 27, 2025
కృష్ణా: ఇప్పటి వరకు 30.59% మేర ఓట్లు పోల్

కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 1 2గంటలకు 30.59% ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో మొత్తం 63,144 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 19,306 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.