News February 27, 2025

ఇవాళ స్కూళ్లకు సెలవు ఉందా?

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో అధికారులు సెలవు ప్రకటించారు. ఏపీలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో డీఈవోలు సెలవు ప్రకటించినా స్కూల్, కాలేజీ యాజమాన్యాలు ఇవ్వలేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మరి మీకు సెలవు ఇచ్చారా?

Similar News

News November 11, 2025

శబరిమలకు అద్దె బస్సులు

image

TG: రాష్ట్రంలోని నలుమూలల నుంచి శబరిమలకు 200 అద్దె బస్సులు నడపాలని RTC నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడిపేందుకు సిద్ధమై స్పెషల్ టారిఫ్‌లను ఖరారు చేసింది. గురుస్వామి పేరుతో బస్ బుక్ చేస్తే ఆ స్వామి ఉచితంగా ప్రయాణించవచ్చు. ముందుగా కాషన్ డిపాజిట్ రూ.10వేలు చెల్లించాలి. తిరిగొచ్చాక ఆ డబ్బు వెనక్కిస్తారు. పూర్తి వివరాలకు డిపోలో సంప్రదించాల్సి ఉంటుంది.

News November 11, 2025

కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

image

కరోనా లాక్‌డౌన్‌ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

News November 11, 2025

UGC-NET దరఖాస్తులో తప్పుల సవరణకు అవకాశం

image

అసిస్టెంట్ ప్రొఫెసర్, JRFకోసం నిర్వహించే UGC-NET డిసెంబర్ 2025 దరఖాస్తులో తప్పుల సవరణకు NTA అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 12న సవరణ చేసుకోవచ్చని ప్రకటించింది. అభ్యర్థుల పేరు, జెండర్, ఫొటో, సంతకం, మొబైల్ నంబర్, ఈ- మెయిల్, అడ్రస్, పరీక్ష సిటీ మార్చుకోవచ్చు. పరీక్షలు డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి.