News February 27, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు ఉందా?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో అధికారులు సెలవు ప్రకటించారు. ఏపీలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో డీఈవోలు సెలవు ప్రకటించినా స్కూల్, కాలేజీ యాజమాన్యాలు ఇవ్వలేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మరి మీకు సెలవు ఇచ్చారా?
Similar News
News February 5, 2026
దేశంలో ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

దేశంలో డిజిటల్ సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అందరికీ ఆ ప్రయోజనాలు చేరడం లేదు. దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇప్పటికీ ఇంటర్నెట్కు దూరంగా ఉంది. సుమారు 13.7% కుటుంబాలకు ఆన్లైన్ సదుపాయం లేదు. అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఈ గ్యాప్ ఆందోళన కలిగిస్తోంది.
News February 5, 2026
T20WC: శాంసన్ కథ ముగిసినట్లేనా?

టీ20 వరల్డ్ కప్లో సంజూ శాంసన్కు అవకాశం దక్కడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వార్మప్ మ్యాచ్లో అతను బ్యాటింగ్కు రాకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. న్యూజిలాండ్తో సిరీస్లో పేలవ ప్రదర్శనతో సంజూ టీమ్ మేనేజ్మెంట్నే కాదు.. అభిమానులను కూడా ఎంతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను T20WCలో అవకాశం కోల్పోనున్నారని, అందుకే వార్మప్ మ్యాచ్లోనూ కనిపించలేదని చెబుతున్నారు.
News February 4, 2026
‘యానిమల్ పార్క్’ సినిమా షూటింగ్ అప్డేట్

వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో ‘యానిమల్ పార్క్’ సినిమా షూటింగ్ను ప్రారంభిస్తామని డైరెక్టర్ సందీప్ వంగా వెల్లడించారు. ఒకే విధంగా కనిపించే ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగే వార్ను ఇందులో చూపెట్టబోతున్నట్లు చెప్పారు. రన్ విజయ్, అజీజ్ పాత్రల మధ్య జరిగే ఘర్షణే ఈ సినిమా అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సందీప్ ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. అటు రణ్బీర్ ‘రామాయణ’, ‘లవ్&వార్’ సినిమాలు చేస్తున్నారు.


