News February 27, 2025

బద్వేలు: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

image

బద్వేలుకు చెందిన ఆరు సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల వివరాల మేరకు.. బద్వేలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్న మంజుల అనే బాలిక స్పృహ కోల్పోయింది. హుటాహుటిన అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 24, 2026

బ్రహ్మంగారిమఠంలో రూ.139 కోట్లతో పనులు

image

బ్రహ్మంగారిమఠంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రసాదం పథకం ద్వారా రూ.139కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆధునిక హంగులతో దేవస్థానం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News January 24, 2026

గరుడ వాహనంపై వైకుంఠనాథుడి దర్శనం

image

దేవుని గడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. ఉదయం నుంచి స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

News January 23, 2026

కడప: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

image

కడప జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19 నుంచి అందుబాటులోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.