News February 27, 2025
‘పంజా విసిరే పులులు’.. ఐసీసీ ట్రోఫీల్లో అఫ్గాన్ హవా

తాము పసికూనలం కాదు పంజా విసిరే పులులం అని అఫ్గానిస్థాన్ మరోసారి నిరూపించింది. 2023 వన్డే WC నుంచి ఆ జట్టు పెద్ద టీంలకు ఝలక్ ఇస్తోంది. 2023 WCలో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలను మట్టికరిపించింది. 2024 టీ20 WCలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్స్కు వెళ్లింది. తాజాగా CTలో ఇంగ్లండ్ను ఓడించి ఇంటిదారి పట్టేలా చేసింది. తమ దేశంలో సరైన ప్రాక్టీస్ సౌకర్యాలు లేకున్నా అఫ్గాన్ రాణించడం విశేషం.
Similar News
News February 27, 2025
Breaking: వక్ఫ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

JPC రిపోర్టు ఆధారంగా సవరించిన వక్ఫ్ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. మార్చి 10 నుంచి మొదలయ్యే బడ్జెట్ రెండో దఫా సమావేశాల్లో లోక్సభలో ప్రవేశపెట్టనుంది. సాధారణ ఓటింగుతో ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజముద్ర వేస్తే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
News February 27, 2025
చిట్టీల పేరుతో చీటింగ్.. రూ.100కోట్లతో జంప్!

HYDలో ఓ చిట్టీల వ్యాపారి సుమారు 2వేల మందికి డబ్బులు చెల్లించకుండా ఫ్యామిలీతో పరారయ్యాడు. అనంతపురం జిల్లాకి చెందిన పుల్లయ్య 18yrs క్రితం HYD వచ్చాడు. కూలీ పనులు చేసే అతను చిట్టీల వ్యాపారంతో కోటీశ్వరుడయ్యాడు. బీకేగూడ రవీంద్రానగర్లో ఉంటూ స్థానికులతో చిట్టీలు వేయించాడు. డబ్బులు తిరిగి చెల్లించాలని అడగడంతో ఈనెల 21న పరారయ్యాడు. బాధితులంతా అతని ఇంటికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది.
News February 27, 2025
ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం: KTR

TG: సినీ నిర్మాత కేదార్ మరణం గురించి సీఎం రేవంత్ చేసిన <<15587966>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘హత్యలు, మరణాలు అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్షంలా మాట్లాడుతున్నారు. తాను ఏం చెప్పినా జనాలు నమ్ముతారని అనుకోవడం పొరపాటే. ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉంది. ఎలాంటి విచారణకైనా సిద్ధం’ అని స్పష్టం చేశారు.