News February 27, 2025
జగిత్యాల: నేడే పోలింగ్.. అంతా రెడీ!

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పట్టభద్రులు 35,281, ఉఫాధ్యాయులు 1,769 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం 51, ఉపాధ్యాయుల కోసం 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ స్థానంలో 15 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.
Similar News
News February 27, 2025
భువనగిరి: ఒకే కాన్పులో రెండు లేగదూడలు

ఆవు ఒకే కాన్పులో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన అరుదైన ఘటన భువనగిరి మున్సిపాలిటి రాయగిరిలో తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన కొత్త కృష్ణ అనే రైతుకు చెందిన పాడి రైతు ఆవు ఉదయం రెండు లేగ దూడలను జన్మనిచ్చింది. లేగ దూడలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఇలాంటి అరుదైన ఘటన జరగడం విశేషమని రైతు తెలిపారు. ప్రసవించిన లేగ దూడలను చూడడానికి స్థానికులు రైతు ఇంటికి తరలివెళ్లారు.
News February 27, 2025
రేవంత్ సీఎం కావటం ప్రజల దురదృష్టం: కిషన్ రెడ్డి

TG: మెట్రో విస్తరణ తాను అడ్డుకున్నట్లు నిరూపించే దమ్ముందా అని సీఎం రేవంత్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. ప్రాజెక్ట్ విస్తరణకు రాష్ట్రం వద్ద నయాపైసా లేక తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు కేంద్రాన్ని అడిగి ఇచ్చారా అని ప్రశ్నించారు. రేవంత్ సీఎం కావటం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. గాలిమాటలకు, బ్లాక్మెయిలింగ్కు తాను భయపడనని స్పష్టం చేశారు.
News February 27, 2025
పోసానికి వైద్యపరీక్షలు.. విచారిస్తున్న ఎస్పీ

AP: పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSకు తీసుకొచ్చిన పోలీసులు.. అక్కడే వైద్యుడితో మెడికల్ టెస్టులు చేయించారు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేశ్ వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు పెద్దఎత్తున అనుచరులతో PSకు రాగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.