News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటుకు రూ.5వేలు?

TG: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిన్న ఓటర్లకు పలువురు అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఓటర్లకు పార్టీలు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంపై నిఘా ఉందన్న ప్రచారంతో నేరుగా ఓటర్ల చేతికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు డబ్బులు రాలేవని కొందరు నిరాశ చెందుతుండటం గమనార్హం.
Similar News
News February 27, 2025
మహిళల రక్షణలో సమాజానికీ బాధ్యత ఉంది: జస్టిస్ చంద్రచూడ్

పుణేలోని బస్సులో యువతిపై జరిగిన <<15593054>>అత్యాచారంపై<<>> మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. కేవలం చట్టాలతోనే దురాగతాలను నివారించలేమని అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఎక్కడికెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని మహిళల్లో కలిగించాలని తెలిపారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ, పోలీసులతోపాటు సమాజానికీ బాధ్యత ఉందని పేర్కొన్నారు.
News February 27, 2025
Stock Markets: బ్యాంకు షేర్లు అదుర్స్

గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో బెంచ్మార్క్ సూచీలు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,545 (-2), సెన్సెక్స్ 74,612 (10) వద్ద క్లోజయ్యాయి. బ్యాంకు నిఫ్టీ 135 Pts పెరిగి 48,743 వద్ద స్థిరపడింది. ఫైనాన్స్, బ్యాంకు, మెటల్ షేర్లు ఎగిశాయి. ఆటో, మీడియా, PSU బ్యాంకు, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు ఎరుపెక్కాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ట్విన్స్, హిందాల్కో, సన్ఫార్మా టాప్ గెయినర్స్.
News February 27, 2025
వేసవిలో ఎక్కువగా గుడ్లు, మామిడి తింటే వేడిచేస్తుందా?

రోజుకు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, వేసవిలో ఇలా చేస్తే వేడి చేస్తుందని కొందరు తినడం మానేస్తారు. అలాంటి వారికోసం వైద్యులు కీలక సూచనలు చేశారు. ‘వేసవిలో గుడ్లు, మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందని చాలామంది భావిస్తారు. శక్తినిచ్చే ఏ ఆహారమైనా ఎక్కువ కేలరీస్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి అది అపోహ మాత్రమే. మనం వాటిని భేషుగ్గా తినొచ్చు’ అని సూచిస్తున్నారు.