News February 27, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

image

రొద్దం మండల సమీపంలోని దొమ్మత మర్రివద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో రెడ్డి పల్లి నుంచి లేపాక్షికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించగా తిరుమలేశ్, భరత్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 6, 2025

చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్

image

AP: మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆలోచనను CBN మార్చుకునేలా ఉద్యమాలు చేపట్టాలని YS జగన్ YCP విద్యార్థి విభాగానికి సూచించారు. దీనిపై ‘రచ్చబండ’ ద్వారా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. ‘ఈ ఉద్యమాలు ఎలా ఉండాలంటే CBNకు షాక్ తగిలేలా ఉండాలి. ఫీజు రీయింబర్స్‌మెంటుపై కూడా డిసెంబర్ వరకు టైమ్ ఇస్తాం. ఆ తరువాత ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి విద్యార్థి విభాగం ఉండాలన్నారు.

News November 6, 2025

దేశంలో అత్యంత పురాతనమైన శివలింగం!

image

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ సందర్భంగా దేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగం గురించి తెలుసుకుందాం. తిరుపతి(D) గుడిమల్లం పరశురామేశ్వరాలయం అత్యంత పురాతనమైనదని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ ఆలయం క్రీ.పూ. 2వ శతాబ్దం నాటిదని, ఆలయంలోని శివలింగం సుమారు 2,300 ఏళ్లనాటిదని అంచనా వేశారు. ఇక్కడి లింగం సాధారణ రూపంలో కాకుండా, మానవ రూపంలో (వేటగాడి రూపం) రాక్షసుడి భుజాలపై నిలబడినట్లు ఉంటుంది.

News November 6, 2025

MNCL: జిల్లాకు నూతన మండల పంచాయితీ అధికారులు

image

గ్రూప్- 2లో ఎంపికై మంచిర్యాల జిల్లాకు కేటాయించిన నూతన మండల పంచాయితీ అధికారులు వెంకటేష్, మహేష్, రమ్యశ్రీ గురువారం కలెక్టరేట్‌లోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఈ సందర్భంగా డీపీఓ అధికారి వెంకటేశ్వరరావుకు జాయినింగ్ పత్రాలు అందజేయగా.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ ఎంపీఓ శ్రీపతి బాపురావు, సీనియర్ అసిస్టెంట్ ప్రజ్ఞ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.