News February 27, 2025

భారత్‌కు చెప్పే స్థాయి పాక్‌కు లేదు: క్షితిజ్‌ త్యాగి

image

ఇండియాకు నీతులు చెప్పే స్థాయిలో పాక్ లేదని భారత్ రాయబారి క్షితిజ్ త్యాగి తేల్చిచెప్పారు జమ్మూకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐరాస మానవహక్కుల మండలిలో పాక్ మంత్రి అజం నజీర్ తరార్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. మైనారిటీలను చిత్రహింసలు పెడుతూ, తరచుగా మానవహక్కుల ఉల్లంఘన చేసే దేశానికి భారత్‌కు చెప్పే స్థాయి లేదన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాక్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే అని నొక్కిచెప్పారు.

Similar News

News February 27, 2025

షాకింగ్.. కొడుకుకు 18 ఏళ్లు నిండొద్దని చంపేసింది

image

USలో మిచిగాన్‌లో దారుణ ఘటన జరిగింది. కేటీ లీ అనే మహిళ కొడుకు ఆస్టిన్(17)ను బర్త్ డే రోజునే చంపేసింది. తనకు 18 ఏళ్లు నిండొద్దని ఆస్టిన్ కోరుకున్నాడని, ఆ మేరకు తల్లి చంపేసిందని కోర్టు విచారణలో పోలీసులు వెల్లడించారు. అయితే తామిద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక గొంతు కోసినట్లు ఆమె తొలుత 911కు కాల్ చేసి చెప్పడం గమనార్హం. ఆమె మానసిక స్థితి సరిగా లేనట్లు సమాచారం.

News February 27, 2025

Perplexity AIతో పేటీఎం జట్టు

image

తమ యాప్‌లో AI పవర్డ్ సెర్చ్‌ ఆప్షన్ అందించేందుకు Perplexity‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని Paytm CEO విజయ్ శేఖర్ అన్నారు. యూజర్లు ఆర్థిక నిర్ణయాలు తీసుకొనేందుకు, స్థానిక భాషల్లో రోజువారీ ప్రశ్నలు అడిగేందుకు దీంతో వీలవుతుందన్నారు. ‘నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రజలు సమాచారం పొందుతున్న తీరును AI మార్చేసింద’ని ఆయన తెలిపారు. Perplexityని స్థాపించింది IITM గ్రాడ్యుయేట్ అరవింద్ శ్రీనివాస్ కావడం విశేషం.

News February 27, 2025

సత్యవర్ధన్‌కు నార్కో టెస్టులు చేయండి: వంశీ

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను SC, ST కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు తాను కూడా సిద్ధమేనన్నారు. కస్టడీలో పోలీసులు తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలిపారు.

error: Content is protected !!