News February 27, 2025

స్టూడెంట్స్ బుక్స్‌లో ₹3.5కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!

image

పుణే ఎయిర్‌పోర్టులో భారీ హవాలా రాకెట్ బయటపడింది. ముగ్గురు స్టూడెంట్స్ దుబాయ్ వెళ్లేందుకు ట్రావెల్ ఏజెంట్ ఖుష్బూ అగర్వాల్ వద్ద టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫ్లయిట్ ఎక్కే 2hrs ముందు వారికామె 2 బ్యాగుల్లో బుక్స్ పెట్టి దుబాయ్‌లోని తమ బ్రాంచ్‌లో ఇవ్వమన్నారు. విషయం తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని అక్కడి నుంచి మళ్లీ పుణేకి రప్పించారు. చెక్ చేసి బుక్స్‌లోని $4L (Rs 3.5CR)ను స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 27, 2025

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించనున్న మోదీ సర్కార్?

image

కేంద్ర పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాను తగ్గించాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్టు తెలిసింది. వాటా పంపకాలపై సలహాలిచ్చే ఫైనాన్స్ కమిషన్‌కు ఇప్పటికే విషయం చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం 41గా ఉన్న వాటాను కనీసం 40%కి తగ్గించాలని సూచించినట్టు తెలిసింది. అరవింద్ పణగడియా నాయకత్వంలోని కమిషన్ FY2026-27 రికమెండేషన్స్ రిపోర్టును OCT 31లోపు కేంద్రానికి ఇస్తుంది. ఒక శాతం తగ్గినా కేంద్రానికి రూ.35K CR మిగులుతాయి.

News February 27, 2025

PAKISTAN: ఆదాయం 6.. ఖర్చు 60..!

image

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ భారీగా ఖర్చు చేసింది. దాదాపు రూ.591 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క మ్యాచూ గెలవకుండానే లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటిబాట పట్టింది. గ్రూప్ స్టేజీలో ఓడిన జట్లకు ఐసీసీ రూ.2.3 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. ఇది చూసిన నెటిజన్లు పీసీబీపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆదాయం 6.. ఖర్చు 60 అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇకనైనా పీసీబీ తీరు మారాలని కామెంట్లు చేస్తున్నారు.

News February 27, 2025

పోలీసుల విచారణకు సహకరించని పోసాని?

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు 4 గంటలుగా విచారిస్తున్నా ఆయన నోరు మెదపడం లేదని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా మౌనంగా కూర్చుంటున్నారని, ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందని వారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!