News February 27, 2025
సంగారెడ్డిలో ఓటింగ్ శాతం ఇలా..

సంగారెడ్డి జిల్లాలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం10 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ 8.05 శాతంగా టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ 12.94గా నమోదైనట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Similar News
News February 27, 2025
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 93% పోలింగ్ నమోదు

ఖమ్మం జిల్లాలో MLC ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు 93% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 4089 ఓటర్లు ఉండగా 3805 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
News February 27, 2025
పెద్దపల్లి జిల్లాలోని పోలింగ్ అప్డేట్

పెద్దపల్లి జిల్లాలోని పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పట్టభద్రులు మహిళలు 8160, పురుషులు 13098 మొత్తం 21259 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 68.50% పోలింగ్ నమోదయింది. టీచర్స్ ఎమ్మెల్సీలో మహిళలు 438, పురుషులు 611 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 94.42% పోలింగ్ నమోదయింది.
News February 27, 2025
ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు

AP:ఉగాది నుంచి P4(public-philanthropic-people-participation) విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో <<15601118>>P4 <<>>విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని CM చెప్పారు.