News February 27, 2025
మే 2న కేదార్నాథ్ ఆలయం ఓపెన్

చార్ధామ్ యాత్రలో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని మే 2న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ అధికారి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీంతోపాటు ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30న, బద్రీనాథ్ గుడిని మే 4న తెరవనున్నారు. ఈ నాలుగు ఆలయాలను కలిపి చార్ధామ్గా పిలుస్తారు. మంచు, విపరీతమైన చలి కారణంగా ఈ ఆలయాలను సంవత్సరంలో కొన్ని నెలలే తెరుస్తారు.
Similar News
News February 27, 2025
ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు

AP:ఉగాది నుంచి P4(public-philanthropic-people-participation) విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో <<15601118>>P4 <<>>విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని CM చెప్పారు.
News February 27, 2025
P4కు అర్హులు ఎవరు?

AP: P4 కార్యక్రమం అమలు చేయనున్న ప్రభుత్వం సచివాలయాల డేటా, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభ ద్వారా లబ్ధిదారులను గుర్తించనుంది. 2 ఎకరాల మాగాణి/5 ఎకరాల మెట్ట భూమి, ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్స్, ఫోర్ వీలర్స్ ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వాడేవారు అర్హులు కారు. ప్రస్తుతం 10 జిల్లాల్లో హౌస్ హోల్డ్ సర్వే చేస్తుండగా, మార్చి 18 నాటికి మిగతా జిల్లాల్లో సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించనుంది.
News February 27, 2025
EAPCET ప్రవేశాల్లో సవరణలు

తెలంగాణలో ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు <