News February 27, 2025
కామారెడ్డి: ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి: SP

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయని KMR జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. గురువారం ఆమె కామారెడ్డి పట్టణంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. 312 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసులు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News November 10, 2025
GNT: క్రికెట్ బ్యాట్తో కొట్టి.. భార్య చంపిన భర్త.!

రియల్ ఎస్టేట్ వ్యాపారి.. క్రికెట్ బ్యాటుతో కొట్టి తన భార్యను హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా వాసులైన సి.బ్రహ్మయ్య-కృష్ణవేణి దంపతులు అమీన్పూర్లోని కేఎస్నగర్లో నివాసం ఉంటున్నారు. కృష్ణవేణి ఓ బ్యాంక్లో పనిచేస్తున్నారు. ఇరువురు దంపతులకు ఒకరిపై ఒకరికి అనుమానాలు ఉండగా..భార్యతో గొడవ పడిన బ్రహ్మయ్య బ్యాటుతో కొట్టాడు. దీంతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది.
News November 10, 2025
ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.


