News February 27, 2025

రేపే AP బడ్జెట్.. కీలక పథకాలకు కేటాయింపులు

image

AP: అసెంబ్లీలో రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ₹3L Crతో పద్దు ఉండొచ్చని అంచనా. ఉ.9గంటలకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. దీన్ని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల, మండలిలో కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు ఉండనున్నాయి.

Similar News

News January 7, 2026

పసుపు పంట కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

image

పసుపు రకాన్ని బట్టి పంట కాలం 7 నుంచి 9 నెలలుగా ఉంటుంది. పసుపు పంట పక్వానికి వచ్చిన తర్వాతే కోత కోయడం ప్రారంభించాలి. పక్వానికి రాకముందే పంట కోత చేపడితే దిగుబడి తగ్గడంతో పాటు, కుర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్ల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. మొక్కల ఆకులు పాలిపోయి, తర్వాత ఎండిపోయి నేలపై పడిపోతే పంట కాలం పూర్తి అయ్యిందని గుర్తించవచ్చు. ఈ దశలో దుంపలను, కొమ్ములను తవ్వి తీయాలి.

News January 7, 2026

తూర్పు గోదావరి జిల్లాలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

AP: రాజమహేంద్రవరంలోని GMC, GGHలో 60పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా( అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్& ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ECG), బీఎస్సీ, DMLT, BSc(MLT), ఇంటర్(ఒకేషనల్), CLISc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

News January 7, 2026

మనీషా పంచకం ఎందుకు చదవాలి?

image

మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, అహంకారాన్ని తొలగించుకోవడానికి మనీషా పంచకం చదవాలి. బాహ్య రూపం, కులాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం అజ్ఞానమని, అందరిలో ఉన్న ఆత్మ చైతన్యం ఒకటేనని ఇది బోధిస్తుంది. సమదృష్టిని పెంపొందించుకోడానికి, సత్యం వైపు పయణించడానికి ఇవి మార్గదర్శకాలు. ‘నేను శరీరాన్ని కాదు, ఆత్మను’ అనే సత్యాన్ని గ్రహించిన రోజే మనిషికి సంపూర్ణ విముక్తి లభిస్తుందని శంకరాచార్యులు ఇందులో స్పష్టం చేశారు.