News February 27, 2025

CANCER సోకిన మహిళల్లోనే అధిక మరణాలు!

image

క్యాన్సర్ వచ్చిన ఐదుగురిలో ముగ్గురు చనిపోతున్నారని ఇండియన్ మెడికల్ ప్యానెల్ వెల్లడించింది. ది లాన్సెట్‌లో ప్రచురితమైన ICMR తాజా నివేదిక ప్రకారం గత దశాబ్దంలో పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే 2 దశాబ్దాల్లో ఇది పెరుగుతూనే ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సర్ మరణాలు పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉన్నాయి. కాగా, 2012- 2022 మధ్య క్యాన్సర్ కేసులు 36% పెరిగాయి.

Similar News

News January 8, 2026

దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ 10 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంజినీర్స్ సర్టిఫికెట్స్ ఆఫ్ కాంపిటెన్సీ/మెరైన్ ఇంజినీరింగ్ అప్రెంటిస్‌షిప్, BE(ఎలక్ట్రికల్), BLiSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News January 8, 2026

పరకామణిలో సంస్కరణల రిపోర్టుపై హైకోర్టు అసంతృప్తి

image

AP: <<18777180>>పరకామణిలో సంస్కరణల<<>>పై TTD ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కానుకల లెక్కింపునకు మెరుగైన ప్లాన్స్‌తో రావాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనం కిందికి వచ్చే నిందితుడు రవికుమార్, ఆయన ఫ్యామిలీకి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని తెలిపింది. AVSO సతీశ్ మృతిపై విచారణ వేగవంతం చేయాలని చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీకి సూచించింది.

News January 8, 2026

భూమిని కాపాడేందుకు ఈ చిన్న పని చేద్దాం!

image

మనలోని చిన్నమార్పు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్వయంగా వాటర్ బాటిల్ క్యారీ చేయడం ద్వారా లక్షల కొద్దీ ప్లాస్టిక్ బాటిల్స్‌ను అరికట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 10లక్షలకు పైగా ప్లాస్టిక్ బాటిల్స్ విక్రయిస్తే అందులో 9% మాత్రమే రీసైక్లింగ్ అవుతాయి. మిగిలినవి సముద్రాలను, భూమిని కలుషితం చేస్తున్నాయి. అందుకే స్టీల్ లేదా మళ్లీ వాడగలిగే బాటిళ్లనే క్యారీ చేయండి. SHARE IT