News February 27, 2025

ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా పీటర్సన్

image

ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించింది. త్వరలోనే ఆయన జట్టులో చేరనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. కాగా పీటర్సన్ 2009 నుంచి 2016 వరకు ఐపీఎల్‌లో ఆడారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. అప్పటి నుంచే జట్టు ఓనర్ గ్రంధి కిరణ్‌కుమార్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Similar News

News February 28, 2025

TODAY TOP STORIES

image

* ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు
* ఉద్యోగాల కల్పనలో నం.1గా నిలిచాం: CM రేవంత్
* ముగిసిన పోసాని కృష్ణమురళి విచారణ
* బీఆర్ఎస్ వల్లే SLBC ప్రమాదం: ఉత్తమ్
* గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు
* తగ్గిన బంగారం ధరలు
* తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
* ఎల్లుండి ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’
* పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు

News February 28, 2025

చిన్నారిని చిదిమేసిన మానవమృగం.. ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు

image

ఓ మానవమృగం కామవాంఛకు ఐదేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు వేశామని డాక్టర్లు చెప్పడం ఆ 17 ఏళ్ల నిందితుడి రాక్షసత్వానికి నిదర్శనం. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. నిందితుడు పీకలదాకా తాగి బాలిక తలను గోడకు పలుమార్లు కొట్టాడని, శరీరంపై అనేక గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేశామని, జువైనల్‌కు తరలిస్తామని చెప్పారు.

News February 28, 2025

BREAKING: ఆర్సీబీ ఘోర పరాజయం

image

WPLలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గార్డ్‌నర్ (58) ఫిఫ్టీతో రాణించారు. లిచిఫీల్డ్ (30) ఫర్వాలేదనిపించారు. రేణుకా సింగ్, జార్జియా చెరో 2 వికెట్లు తీశారు.

error: Content is protected !!