News February 27, 2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 91.94% నమోదు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం4 గంటలకు ఎన్నికలు ముగిసే సమయానికి 91.94% ఓట్లు పోలైనట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2022 మంది ఓటర్లు ఉండగా 1859 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.

Similar News

News October 20, 2025

REWINED.. వరంగల్‌లో ఇదే తరహా తిరుగుబాటు..!

image

నిజామాబాద్‌లో రియాజ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే జనగామలో కూడా ఎస్కార్ట్ పోలీసులపై తిరగబడ్డ ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపిన ఘటన 2015 ఏప్రిల్ 7న జరిగింది. ఐఎస్ఐ ఉగ్రవాదిగా ఉన్న వికారోద్దీన్‌ను హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా జనగామ ప్రాంతంలో మల విసర్జన కోసం ఆగారు. ఆ సమయంలో పోలీసులపై తిరుగుబాటు చేయడంతో కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందారు.

News October 20, 2025

వీటిని పాటిస్తే అంతా ఆరోగ్యమే: వైద్యులు

image

శరీర భాగాల ఆరోగ్యం కోసం రోజూ చేయాల్సిన పనులను వైద్యులు సూచిస్తున్నారు. ‘మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఉదయాన్నే నీరు తాగండి. మెదడు & హార్మోన్ల కోసం రోజూ కోడిగుడ్లు తినండి. నడక & వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం అల్లం నీరు తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. సూర్యకాంతి వల్ల చర్మం ప్రకాశిస్తుంది. నిద్రకు ముందు పచ్చి వెల్లుల్లి తింటే టెస్టోస్టిరాన్ పెరుగుతుంది’ అని సూచిస్తున్నారు. Share it

News October 20, 2025

పాలమూరు: కురుమూర్తి జాతర.. ‘ఉద్దాల’ ఉత్సవం అంటే..!

image

ప్రసిద్ధ కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ‘ఉద్దాల’ ఉత్సవం ప్రధాన ఘట్టం. స్వామివారి పాదుకలనే ‘ఉద్దాలు’ అని పిలుస్తారు. వీటిని వడ్డెమాన్‌కి చెందిన దళితులు నియమ నిష్ఠలతో తయారు చేస్తారు. రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన ఆవు చర్మంతో వీటి తయారీ జరుగుతుంది. దీపావళి అమావాస్య నుంచి సుమారు 7 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఉద్దాలతో తలపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.