News February 27, 2025
సిరిసిల్ల: తంగళ్లపల్లి, చందుర్తి, రుద్రంగి అత్యధికం, బోయినపల్లిలో అత్యల్పం

సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో తంగళ్లపల్లి, రుద్రంగి, చందుర్తి మండలాలలోని పోలింగ్ కేంద్రాలలో అత్యధికంగా 100 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా బోయిన్ పల్లిలో 78.26 శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
VKB: వందేమాతరం దేశ సమైక్యతకు తోడ్పడుతుంది: కలెక్టర్

వందేమాతరం జాతీయగీతం దేశ సమైక్యతకు తోడ్పడుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో కలిసి సామూహిక వందేమాతరం గేయం ఆలపించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 7, 2025
రోడ్ల స్థితిగతులపై కొత్త సిస్టమ్: పవన్ కళ్యాణ్

AP: పల్లె రోడ్ల స్థితిగతులు ప్రజలకు ముందుగా తెలిసేలా ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ను తీసుకురానున్నట్టు Dy CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ₹2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెపండగ 2.0లో 4007 KM రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించాలని చెప్పారు. నిర్మాణాలు నాణ్యతతో ఉండాలన్నారు. స్వమిత్వ పథకం ద్వారా గ్రామాల్లో MARకి కోటి మంది ఆస్తులకు యాజమాన్య హక్కు (ప్రాపర్టీ) కార్డులు అందించాలని సూచించారు.
News November 7, 2025
‘మన మిత్ర’ సేవలు ప్రతి ఇంటికి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలోని వంద శాతం కుటుంబాలు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకునేలా నేటి నుంచి ప్రతి శుక్రవారం ఇంటింటి ప్రచారం ప్రారంభించాలని కలెక్టర్ డా.ఏ.సిరి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కుటుంబం ‘మన మిత్ర’ యాప్ ద్వారా సేవలను వినియోగించుకునేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జడ్పీ సీఈవోలు, డీఎల్డీవోలు పర్యవేక్షించాలని సూచించారు.


