News February 27, 2025

శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి: ముఖేష్ కుమార్

image

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ అన్నారు. విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. తార్కిక ఆలోచన పెంపొందించుకోవడం ద్వారా పరిశోధన చేయడానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ముందస్తుగా గురువారం సైన్స్ ఫొటోస్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Similar News

News January 17, 2026

కొత్తగూడెం: గ్రామాల్లో విద్యాభివృద్ధికి CSR సహకరించాలి: కలెక్టర్

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధుల ద్వారా సహకరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. గురువారం సీఎస్ఆర్ బృందంతో కలిసి పాల్వంచలోని భవిత కేంద్రం, కోయగట్టు పాఠశాలలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు, బృంద సభ్యులు పాల్గొన్నారు.

News January 17, 2026

ఈ-ఆఫీస్ ద్వారానే అన్ని కార్యక్రమాలు: హెల్త్ డైరెక్టర్

image

PHC స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వైద్య సిబ్బంది కార్యకలాపాలను ఈ-ఆఫీస్ ద్వారా నిర్వహించాలని ప్రజా ఆరోగ్య శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ పద్మావతి సూచించారు. శనివారం జిల్లా వైద్యాధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. కార్యకలాపాలను కాగిత రహిత పరిపాలనగా కొనసాగించాలన్నారు. మ్యానువల్ పద్ధతి నిర్వహిస్తే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News January 17, 2026

ఇరాన్ నుంచి వెెనుదిరుగుతున్న భారతీయులు

image

అంతర్గత నిరసనలు, మరోపక్క USతో యుద్ధవాతావరణం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులు వెనక్కి వస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని అక్కడి ఇండియన్ ఎంబసీ ఇప్పటికే హెచ్చరించింది. ఆ దేశంలో 9000 మంది భారతీయులుండగా వీరిలో విద్యాభ్యాసం కోసం వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. కమర్షియల్ విమానాలు ప్రస్తుతం తిరుగుతున్నందున ఇరాన్ వీడి వెళ్లడం మంచిదని సూచించింది.