News February 27, 2025

శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి: ముఖేష్ కుమార్

image

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ అన్నారు. విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. తార్కిక ఆలోచన పెంపొందించుకోవడం ద్వారా పరిశోధన చేయడానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ముందస్తుగా గురువారం సైన్స్ ఫొటోస్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Similar News

News January 12, 2026

జోగులాంబ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

అలంపూర్ జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు (జనవరి 19-23), బాలబ్రహ్మేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు (ఫిబ్రవరి 14-18) హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖలను ఆలయ బృందం ఆహ్వానించింది. సోమవారం హైదరాబాద్‌లో వారిని కలిసిన ఈవో దీప్తి, అర్చకులు కృష్ణమూర్తి శర్మ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వివరించారు.

News January 12, 2026

గద్వాల: జిల్లాల పునర్విభజన ప్రకటనతో సరిహద్దు ప్రజల్లో అయోమయం

image

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గుర్రంగడ్డ, ఎర్రవల్లి, ధరూర్ మండలాల గ్రామాలతో పాటు, కొత్తగా ఏర్పడిన ఉండవెల్లి, కేటిదొడ్డి మండలాల ప్రజలు తమ ప్రాంతాల భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నారు. భౌగోళిక మార్పులు ఎలా ఉంటాయోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

News January 12, 2026

ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే సిద్ధాంతబద్ధమైన పార్టీ కాంగ్రెస్: వరంగల్ MP

image

కాంగ్రెస్ పార్టీ అంటే పదవుల కోసం కాదు, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే సిద్ధాంతబద్ధమైన పార్టీ అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ DCC ఆఫీస్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ హాజరై మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న విశ్వాసాన్ని మరింత పటిష్ఠం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు.