News February 28, 2025
TODAY TOP STORIES

* ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు
* ఉద్యోగాల కల్పనలో నం.1గా నిలిచాం: CM రేవంత్
* ముగిసిన పోసాని కృష్ణమురళి విచారణ
* బీఆర్ఎస్ వల్లే SLBC ప్రమాదం: ఉత్తమ్
* గోరంట్ల మాధవ్కు పోలీసుల నోటీసులు
* తగ్గిన బంగారం ధరలు
* తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
* ఎల్లుండి ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’
* పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు
Similar News
News February 28, 2025
అంతరిక్ష యాత్రకు జెఫ్ బెజోస్ గర్ల్ఫ్రెండ్

అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ప్రియురాలు లారెన్ సాంచెజ్ అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న స్పేస్ ట్రిప్కు మరికొందరు మహిళలతో కలిసి ఆమె వెళ్లనున్నారు. ఐషా బో, కరియాన్నే ఫిన్, గాలే కింగ్, అమాండా గుయేన్, కేటీ పెర్రీలతో కలిసి ఆమె అంతరిక్షంలో విహరించనున్నారు. కాగా జెఫ్ బెజోస్కే చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ 2021 నుంచి సంపన్న పర్యాటకులను స్పేస్ ట్రిప్కు తీసుకెళ్తున్న విషయం తెలిసిందే.
News February 28, 2025
పెన్షన్ పంపిణీలో మార్పులు

AP: ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్న పెన్షన్ల పంపిణీ సమయానికి సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అధికారుల ఒత్తిడితో చాలా మంది తెల్లవారుజామున 4 నుంచే పంపిణీ చేస్తుండగా ఉద్యోగులతో పాటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ సమయానికే యాప్ పని చేసేలా మార్పులు చేసింది.
News February 28, 2025
బడ్జెట్కు క్యాబినెట్ ఆమోదం

AP: రూ.3.24లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఆయన వెంకటాయపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. బడ్జెట్ ప్రతులను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం వాటిని సీఎం, డిప్యూటీ సీఎంకు అందజేశారు.