News February 28, 2025
ఆత్మకూరు: బ్రహ్మోత్సవాలకు బోట్ల రాక

ఆత్మకూరు పట్టణంలో త్వరలో జరగబోయే చర్ల పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమేశ్వర స్వామి చెరువులో విహరించేందుకు పిల్లలకు, పెద్దలకు ఆనందం కలిగించేందుకు, బ్రహ్మోత్సవాల కమిటీ సభ్యులు బోట్ లను తెప్పించారు. ఇట్టి బోట్ లు పరమేశ్వర స్వామి చెరువులో విహరించనున్నాయి. వీటి రాకకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీహరి కి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 13, 2026
భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు?

దక్షిణాయనంలో సూర్యుడు దూరమవ్వడం వల్ల చలి విపరీతంగా పెరుగుతుంది. ఆ చలిని తట్టుకోవడానికి, ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ ఈ మంటలు వేస్తారు. ఈ మంటలు చలి నుంచి రక్షణనిస్తూ శరీరానికి వెచ్చదనం ఇస్తాయి. అలాగే గతేడాది పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేసి, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలు ప్రసాదించమని కోరుతూ ఈ మంటలు వేస్తారు. నూతన వెలుగులతో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఈ భోగి మంటల అసలైన ఉద్దేశం.
News January 13, 2026
‘లైట్ ట్రాప్స్’తో సుడిదోమ, పచ్చదోమ కట్టడి

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతంచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్తో పాటు ఒక టబ్లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.
News January 13, 2026
పెరగనున్న చలి

AP: సంక్రాంతి వేళ చలి తీవ్రత పెరగనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. కొమరిన్ తీర పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ చాలా చోట్ల మేఘాలు ఆవరించే అవకాశం ఉందని చెప్పింది. ఫలితంగా పగలు చల్లని వాతావరణం ఉంటుందని తెలిపింది. రేపటి నుంచి ఆకాశం నిర్మలంగా మారి చలి పెరుగుతుందని, నాలుగైదు రోజులు ఇలాగే కొనసాగుతుందని పేర్కొంది. అటు నిన్న రాయలసీమ, కోస్తాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే.


