News February 28, 2025
నమాజ్ వేళలు.. ఫిబ్రవరి 28, శుక్రవారం

ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News February 28, 2025
పెన్షన్ పంపిణీలో మార్పులు

AP: ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్న పెన్షన్ల పంపిణీ సమయానికి సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అధికారుల ఒత్తిడితో చాలా మంది తెల్లవారుజామున 4 నుంచే పంపిణీ చేస్తుండగా ఉద్యోగులతో పాటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ సమయానికే యాప్ పని చేసేలా మార్పులు చేసింది.
News February 28, 2025
బడ్జెట్కు క్యాబినెట్ ఆమోదం

AP: రూ.3.24లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఆయన వెంకటాయపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. బడ్జెట్ ప్రతులను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం వాటిని సీఎం, డిప్యూటీ సీఎంకు అందజేశారు.
News February 28, 2025
కుల గణన రీసర్వేకు నేడే లాస్ట్.. మంత్రి విజ్ఞప్తి

తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కులగణన సర్వేలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రీసర్వే గడువు నేటితో ముగుస్తుందని చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. ఎంపీడీవో, వార్డు ఆఫీసులతో పాటు seeepcsurvey.cgg.gov.in ద్వారా కూడా సమాచారాన్ని ఇవ్వొచ్చని వివరించారు.