News February 28, 2025
దిలావర్పూర్: ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని జాలరి మృతి

ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని ఓ జాలరి మృతి చెందిన ఘటన దిలావర్పూర్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ వివరాల మేరకు… కాండ్లి గ్రామానికి చెందిన భోజన్న (59) శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వలలు చిక్కుకొని మృతి చెందాడని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
Similar News
News January 7, 2026
కామారెడ్డి: 10వ తేదీలోగా అప్లై చేసుకోండి..!

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ‘రేవంత్ అన్న కా సహారా మిస్కినో కే లియే’ పథకాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు కామారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోపు https://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 7, 2026
పాడిపై చలిపంజా: తగ్గుతున్న పాల ఉత్పత్తి!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలి తీవ్రత పాడి పరిశ్రమపై పెను ప్రభావం చూపుతోంది. డిసెంబర్ నుంచి చలి పెరగడంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల పశువులు ఉండగా, 5 లక్షల పశువుల ద్వారా రోజుకు 25 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం చలి కారణంగా లీటర్ల కొద్దీ దిగుబడి తగ్గి, పాడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
News January 7, 2026
MBNR: SSC, INTER.. ఫీజు చెల్లించండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరే విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్(TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు. ఈ నెల 16లోగా(ఫైన్తో) ఎగ్జామ్ ఫీ ఆన్లైన్లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్లో సందర్శించాలన్నారు.
#SHARE IT


