News February 28, 2025

MBNR: 36 పరీక్ష కేంద్రాలు, 22,483 మంది విద్యార్థులు: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 22,483 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. గురువారం పరీక్షలపై సమీక్షించిన కలెక్టర్, పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక రవాణా సదుపాయంతో పాటు తాగునీరు వసతి ప్రథమ చికిత్స వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 11, 2025

మహిళలకు స్వయం ఉపాధి ఉచిత శిక్షణ

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. టైలరింగ్, బ్యూటీ పార్లర్ కోర్సుల్లో ఉచిత భోజన వసతితో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News November 11, 2025

మూసాపేట: పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం మూసాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. బోర్డుపై ఉన్న వర్ణమాల, సరళ పదాలను విద్యార్థులతో చదివించి తెలుసుకున్నారు. అక్షయపాత్ర ద్వారా అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

News November 11, 2025

MBNR: ‘ధాన్యం కేంద్రాల వద్ద ఇబ్బందులు ఉండొద్దు’

image

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం మూసాపేట మండలం తిమ్మాపూర్, కొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కల్పించిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ ఆరా తీశారు.