News February 28, 2025
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

AP: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Similar News
News November 7, 2025
నాకు విజయ్తో శత్రుత్వం లేదు: అజిత్

కోలీవుడ్లో ఫ్యాన్ వార్పై హీరో అజిత్ అసహనం వ్యక్తం చేశారు. దళపతి విజయ్తో తనకు వైరం ఉందనే ప్రచారాన్ని ఖండించారు. ‘కొందరు నాకు, విజయ్కు శత్రుత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసి అభిమానులు గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు సృష్టించే వారు మౌనంగా ఉండటం మంచిది. నేనెప్పుడు <<18165294>>విజయ్ మంచినే<<>> కోరుకుంటా’ అని స్పష్టం చేశారు. కరూర్ తొక్కిసలాటకు అందరూ బాధ్యులేనని అజిత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
News November 7, 2025
లావెండర్ నూనెతో మేనికి మెరుపు

అందాన్ని పెంచడంలో ఎసెన్షియల్ ఆయిల్స్ కీలకంగా పనిచేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది లావెండర్ ఆయిల్. దీన్ని ఎలా వాడాలంటే..* 2చుక్కల లావెండర్ నూనెని పావుకప్పు బ్రౌన్ షుగర్లో కలిపి, స్నానం చేసేముందు ఒంటికి రుద్దుకోవాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి మొటిమలు, యాక్నేను తగ్గిస్తుంది. * అరటిపండు గుజ్జు, తేనె, 2చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసి పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.
News November 7, 2025
264 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అనుమతి

AP: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీఎస్పీలో 19 SI, 245 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27లో 10 SI, 125 కానిస్టేబుల్, 2027-28లో 9 SI, 120 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసు నియామక మండలికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.


