News March 22, 2024
25న భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

TG: భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం పనులకు మార్చి 25న శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి, పసుపు కొమ్ములు దంచుతారు. అలాగే తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ ఏడాది 200 క్వింటాళ్ల మేర తలంబ్రాలు కలిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా.. నవమి రోజున వీటిని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
Similar News
News April 23, 2025
మోదీ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభం

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.
News April 23, 2025
నరకకూపంలా మారుతున్న కశ్మీర్: సల్మాన్

ఉగ్రవాదుల దాడితో స్వర్గంలాంటి జమ్మూ కశ్మీర్ నరకంలా మారుతోందని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అమాయక ప్రజల మృతికి సంతాపం తెలియజేశారు. మరోవైపు టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా పహల్గామ్ దాడిని ఖండించారు. మతం పేరుతో ఇలాంటి విధ్వంసాలు సృష్టించడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
News April 23, 2025
పహల్గామ్ బాధితుల కోసం హెల్ప్ డెస్క్: మంత్రి లోకేశ్

AP: పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కోసం ఢిల్లీ AP భవన్లో ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఎలాంటి సహాయం అవసరమైనా ‘98183 95787’ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. కాగా ఉగ్రదాడిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.