News March 22, 2024
మోదీ, కేసీఆర్కు తేడా లేదు: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో KCR శకం ముగిసిందని, ఇక ఏం చేసినా ఆయనను ప్రజలు నమ్మరని CM రేవంత్ అన్నారు. ‘KCR అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని అప్పులపాలు, అవినీతిమయం చేశారు. మోదీ, ఆయన ఒకే రకమైన నేతలు. అప్రజాస్వామిక విధానాలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో వారిద్దరికి తేడా లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
Similar News
News September 13, 2025
బాగా నమిలి తినండి: వైద్యులు

ఆహారాన్ని గబగబా తినొద్దని, అలా చేస్తే సరిగ్గా జీర్ణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఎంత తక్కువ సమయంలో తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. వేగంగా, నమలకుండా తింటే సరిపడనంత తిన్నామనే భావన కలగదని.. అరగంట పాటు నెమ్మదిగా, బాగా నమిలి తినాలని సూచిస్తున్నారు. దీనివల్ల అది పూర్తిగా జీర్ణమై పోషకాలన్నీ శరీరానికి అందుతాయని, అలాగే దవడలకూ మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.
News September 13, 2025
ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్కాట్ చేయాలి: రాజా సింగ్

పాకిస్థాన్తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడొద్దని TG ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆసియా కప్లో రేపు జరిగే మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్తో మ్యాచ్ సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. భారతీయులందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అటు ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపకపోవడంతో టికెట్ సేల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
News September 13, 2025
ASIA CUP: నిప్పులు చెరిగిన లంక బౌలర్లు

ఆసియా కప్లో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక బౌలర్లు విజృంభించారు. నువాన్ తుషారా, దుష్మంత చమీర నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఖాతా తెరవకుండానే బంగ్లా తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు తంజిద్ హసన్(0), పర్వేజ్ ఎమోన్(0) డకౌట్లుగా వెనుదిరిగారు. హృదోయ్ (8) రనౌట్గా వెనుదిరిగారు. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 5 ఓవర్లలో 16/3గా ఉంది.