News February 28, 2025
ఐ.పోలవరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్డెడ్

ఐ.పోలవరం మండలం పాతఇంజరం వద్ద అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ముమ్మిడివరం(M) కర్రివానిరేవుకు చెందిన మట్టా ఆకాష్ రెడ్డి, కొండేపూడి సిద్దార్థ కుమార్ బైక్పై యానాం నుంచి కర్రివానిరేవుకు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఐ.పోలవరం పోలీసులు మృతదేహాలను ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 17, 2026
బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి: బండి సంజయ్

TG: త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధికి నయాపైసా రాదని, బీఆర్ఎస్కు వేస్తే వృథాయేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
News January 17, 2026
జగిత్యాల: ‘ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం’

జగిత్యాల జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయికల్, జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత పాల్గొన్నారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో BRS జెండా ఎగరడం ఖాయమని కోరుట్ల MLA కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
News January 17, 2026
పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✒రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం
✒MBNR: CM ఇలాకా.. BRSలో భారీగా చేరికలు
✒పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ
✒వనపర్తి:భార్య చేతిలో భర్త దారుణ హత్య
✒రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం
✒సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన.. జర్నలిస్టులు ముందస్తు అరెస్ట్
✒పాలమూరులో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:CM రేవంత్ రెడ్డి


