News February 28, 2025

KMR: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 5 నుంచి షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. ఇంటర్ మొదటి సంవత్సరం 8743, ద్వితీయ సంవత్సరం 9726 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్‌ బృందాలను నియమించారు.

Similar News

News January 17, 2026

ఏపీ నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు

image

సంక్రాంతి సెలవులు ముగియడంతో AP నుంచి HYDకు వాహనాల రద్దీ పెరిగింది. NH-65 విస్తరణ పనుల దృష్ట్యా అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి HYD వచ్చే వెహికల్స్‌ను మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి-మాల్, మాచర్ల-సాగర్-పెద్దవూర-చింతపల్లి-మాల్ మీదుగా, విజయవాడ నుంచి వచ్చే వాటిని కోదాడ-మాల్ నుంచి HYDకు పంపిస్తున్నారు. NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లించనున్నారు.

News January 17, 2026

నిర్మల్: ప్రతిపాదనలన్నింటికీ సీఎం ‘ఓకే’

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి భాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కోరిన పలు అభివృద్ధి పనులకు సానుకూలంగా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తులపై సైతం సీఎం సానుకూలత వ్యక్తం చేస్తూ నిధులు మంజూరు చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని సీఎం ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

News January 17, 2026

గోరంట్ల మాధవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

image

అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ నమోదైన కేసులో మాజీ MP గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోక్సో న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు మాధవ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారెంట్‌ జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.