News February 28, 2025
సిద్దిపేటలో MLC ఓటింగ్ ఇలా..

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేటలో టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ 94.83% అంటే ఓటర్లు 3212 ఉండగా 3046 మంది పురుషులు, 1925 మహిళలు 1121 వినియోగించుకున్నారు. అలాగే పట్టబద్రుల ఓటింగ్ 72.83% జరగగా 32589 మంది ఓటర్లకు 23736 మంది పురుషులు 16143, మహిళలు 7593 ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.
Similar News
News February 28, 2025
పెన్షన్ల పంపిణీ కోసం రూ.112.06 కోట్లు: తిరుపతి కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను మార్చి 1న ఉదయం లబ్ధిదారుల ఇంటి వద్దనే సిబ్బంది పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,62,461 మంది పెన్షన్ దారులకు సుమారు 112.06 కోట్ల రూపాయలను పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉదయం 7గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
News February 28, 2025
సిరిసిల్ల: చికిత్స పొందుతూ గర్భిణీ మృతి

కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన సిద్రవేణి సోని అనే గర్భిణీ మృతిచెందింది. చికిత్స కోసం ఆమె హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సోని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 28, 2025
రేపు ఆదిలాబాద్కు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి..

ఆదిలాబాద్లో శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకా యారా పర్యటించనున్నారు. జిల్లా కోర్టులో డిస్పెన్సరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్కు చేరుకుంటారు. ఉ. 10.30 జిల్లా కోర్టుకు రానున్నారు. అనంతరం మరుసటి రోజు ఆదివారం ఉదయం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.