News February 28, 2025
Stock Markets: బ్లడ్బాత్.. విలవిల

దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెక్సికో, కెనడా, చైనాపై టారిఫ్స్ మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. నిఫ్టీ 22,265 (-280), సెన్సెక్స్ 73,690 (-930) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్కేర్, బ్యాంక్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి. కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.
Similar News
News February 28, 2025
CT: వర్షంతో నిలిచిన మ్యాచ్

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన AFG 273 పరుగులు చేయగా, ఆసీస్ 12.5 ఓవర్లలో 109 పరుగులు చేసింది. మరోవైపు పవర్ ప్లేలో అత్యధిక పరుగులు(10 ఓవర్లలో 90) చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. ఇక AUS ప్లేయర్ హెడ్ ఆ జట్టు తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(34 బంతుల్లో 51) చేశారు. ఇరు జట్లు సెమీస్ చేరేందుకు ఈ మ్యాచ్ ఫలితం కీలకంగా ఉంది.
News February 28, 2025
రోజులో ఏ సమయంలో నీళ్లు తాగాలంటే?

ఉదయం పరగడుపునే 1 లీటర్ నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి తాగలేని వారు కాస్త గ్యాప్ ఇచ్చి తాగాలి. గోరు వెచ్చటి నీటిని తాగితే వ్యర్థాలు, టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్తాయి. పేగులు శుభ్రంగా మారతాయి. అలాగే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత నీరు తాగాలి. ఇలా చేస్తే నీళ్లు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. వ్యాయామానికి ముందు గ్లాసు నీరు తీసుకోవాలి. నిద్ర పోయేముందు ఓ గ్లాసు నీరు తాగాలి.
News February 28, 2025
రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం: రేవంత్

TG: పదేళ్ల BRS పాలనలో వరంగల్కు ఏం చేశారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘వరంగల్కు ఎయిర్పోర్టు కావాలని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడిని నేనే అడిగా. భూసేకరణను క్లియర్ చేసి ఎయిర్పోర్టు, రింగ్ రోడ్డు కావాలని ఢిల్లీలో నివేదికలు అందించాకే కదలిక వచ్చింది. ఢిల్లీకి ఇందుకే వెళ్తున్నాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నేనే సాధించా. రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం’ అని CM స్పష్టం చేశారు.