News February 28, 2025

సంగారెడ్డిలో మహిళ హత్య..UPDATE

image

సదాశివపేటలో <<15595690>>మహిళ హత్య <<>>జిల్లాలో కలకలం రేపుతోంది. CI మహేశ్ గౌడ్ వివరాలిలా.. నందికందికి చెందిన చిన్నలక్ష్మి(39) అనంతసాగర్‌లో కుమార్తె శిరీష వద్దకు వెళ్లి 26న తిరిగి ఇంటికొచ్చింది. అదేరోజు రాత్రి పని ఉందని భర్తకు చెప్పి సదాశివపేటకు వచ్చింది. నిన్న ఉదయం MPDO ఆఫీసు సమీపంలో లక్ష్మి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 30, 2025

NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..

image

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<>NHIDCL<<>>)లో 6 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సివిల్స్ మెయిన్స్ 2024 క్వాలిఫై, ఇంటర్వ్యూకు హాజరైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34 ఏళ్లు. సివిల్స్ మెయిన్స్‌లో సాధించిన మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

News December 30, 2025

KMR: ‘ఎగిరే గాలిపటం.. తీయొద్దు ప్రాణం’

image

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహం ఇతరుల ప్రాణాల మీదకు రాకూడదని KMR ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజలను కోరారు. గత సంక్రాంతి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 65 బెండల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

News December 30, 2025

మేడారంలోనే ఎస్పీ కేకన్ అడ్డా

image

మేడారం జాతరలోనే జిల్లా అధికారులు మకాం పెట్టారు. ములుగు ఎస్పీ రాంనాథ్ కేకన్ స్వయంగా మేడారంలోనే తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఎస్పీ, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, సీఐ దయాకర్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రోడ్ల మరమ్మతు జరుగుతుండటంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరగకుండా పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా, వణుకుతూనే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.