News February 28, 2025

కిషన్ రెడ్డికి CM రేవంత్ బహిరంగ లేఖ

image

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి CM రేవంత్ 9 పేజీల బహిరంగ <>లేఖ<<>> రాశారు. ప్రభుత్వ వినతులను పట్టించుకోవడం లేదని తేదీలతో సహా ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై 2024, నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించినా స్పందన లేదని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవంపైనా అదే తీరని పేర్కొన్నారు. ఇకనైనా TGకు సంబంధించి రూ.1,63,559.31కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరుకు శ్రద్ధ వహించాలని లేఖలో రేవంత్ కోరారు.

Similar News

News February 28, 2025

రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్

image

TG: రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ నేతల లక్ష్యమని CM రేవంత్ అన్నారు. అప్పటివరకు కార్యకర్తలు విశ్రమించవద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇన్ని చేస్తే కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేయగలమో ఆలోచించాలని కార్యకర్తలకు సూచించారు.

News February 28, 2025

టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 300 నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును మార్చి 3 వరకు పొడిగించారు. ఇందులో జనరల్ డ్యూటీ 260(మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ అర్హత), డొమిస్టిక్ బ్రాంచ్ 40(టెన్త్ అర్హత) పోస్టులున్నాయి. వయసు 18-22 ఏళ్లు ఉండాలి. ఫిజికల్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు 21,700-69,100 ఉంటుంది.
వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/

News February 28, 2025

CT: ఆస్ట్రేలియా చెత్త రికార్డు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా చెత్త రికార్డును నమోదు చేసింది. ఏకంగా 37 ఎక్స్‌ట్రాలు సమర్పించుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టుకిదే అత్యధికం. అంతకుముందు 2009లో విండీస్‌తో జరిగిన మ్యాచులో 36 అదనపు పరుగులు సమర్పించుకుంది. ఓవరాల్‌గా 2004లో కెన్యాతో మ్యాచులో భారత జట్టు 42 ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చింది.

error: Content is protected !!