News February 28, 2025

బంగ్లా పుస్తకాల్లో ఇందిర ఫొటోలు తొలగింపు

image

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తమ నూతన పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో సాయం చేసిన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోలను తొలగించింది. బంగ్లా నేత షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలనూ తీసివేసింది. కాగా పాక్ నుంచి బంగ్లాకు విముక్తి కల్పించేందుకు అప్పట్లో ఇందిరా విశేష కృషి చేశారు. ఇందుకు కృతజ్ఞతగా అక్కడి పుస్తకాల్లో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా ఇందిరా ఫొటోలను ముద్రించారు.

Similar News

News March 1, 2025

మిరాకిల్ జరిగితేనే..

image

వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా(3P)తో సమానంగా ఉండగా రేపటి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో SA భారీ తేడాతో ఓడితేనే అఫ్గాన్‌కు అవకాశాలు ఉంటాయి. సుమారు 200 పరుగుల తేడాతో ENG గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా SA నేరుగా సెమీస్ వెళ్లనుంది.

News February 28, 2025

రోహిత్, షమీ సహా అందరూ ఫిట్: కేఎల్

image

ఫిట్‌నెస్ సమస్యలతో మార్చి 2న కివీస్‌తో మ్యాచ్‌కు <<15595049>>రోహిత్,<<>> షమీ దూరమవుతారన్న వార్తలపై కేఎల్ రాహుల్ స్పందించారు. ‘నాకు తెలిసినంత వరకు ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారు. ఎవరూ మ్యాచ్ మిస్సయ్యే ఛాన్స్ లేదు. అందరూ జిమ్, ప్రాక్టీస్ చేస్తున్నారు. పైగా సెమీస్‌కు ముందు ఒక మ్యాచే ఉన్నందున జట్టులో మార్పులు ఉండకపోవచ్చు’ అని తెలిపారు. కాగా ఇవాళ రోహిత్ గంట పాటు మైదానంలో చెమటోడ్చారు.

News February 28, 2025

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్ ఫస్టియర్, 3వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. 10.58 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటుచేశారు. అన్ని సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్టూడెంట్స్ గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

error: Content is protected !!