News February 28, 2025
గౌరారంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

గౌరారం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ టీచర్స్ కాలనీకి చెందిన శ్యామ్ బహదూర్ సింగ్ (41), చందు యాదవ్, సాయి కుమార్ రాయపోల్ నుంచి మేడ్చల్ వెళ్తున్నారు. గౌరారం రాజీవ్ రహదారిపై హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రక్ని కారు ఢీ కొట్టింది. శ్యామ్ బహదూర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికి గాయాలు తగిలాయి.
Similar News
News March 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 1, 2025
జెలెన్స్కీ ఉక్కిరిబిక్కిరి.. ట్రంప్ రాకతో అంతా తారుమారు

రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్కు US అండగా నిలిచింది. బైడెన్ ప్రభుత్వం ఆ దేశానికి నిధులు, యుద్ధ సామగ్రిని సమకూర్చడంతో రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా బదులిచ్చింది. కానీ ఇటీవల US ఎలక్షన్స్లో బైడెన్ ఓటమితో అంతా తారుమారైంది. అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్కు నిధులను ఆపేశారు. అసలు యుద్ధమంతా జెలెన్స్కీ వల్లే వస్తోందని మండిపడ్డారు. ఈక్రమంలోనే US పర్యటనలో ఉన్న జెలెన్స్కీని మీడియా ముందే తిట్టిపోశారు.
News March 1, 2025
ములుగు: ‘ఆయనకు MLC టికెట్ ఇవ్వాలి’

బీసీ కోటాలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని తాడ్వాయిలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సతీశ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి కోరారు. సామాజిక కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తి అశోక్ అని, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి నిత్యావసర వస్తువులు అందించారని, బీసీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.