News February 28, 2025

రూ.8,570 కోట్లు కేటాయించడం ఇదే తొలిసారి: హోం మంత్రి 

image

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో హోంశాఖకు రూ.8,570 కోట్లు కేటాయించడం ఇదే తొలిసారి అని హోమ్ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ‘ఎక్స్’ వేదిగా హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖకు రూ.920 కోట్ల పెండింగ్ బకాయిల్లో ఇప్పటికే రూ.250 కోట్లు చెల్లించామన్నారు. 

Similar News

News September 14, 2025

HYD: భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు

image

నాగోల్‌‌లో భార్య మహాలక్ష్మి గొంతును భర్త వేణుగోపాల్ కత్తితో కోశాడు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అతడు మారకపోగా.. ఈరోజు ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా, వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2025

పెళ్లైనా తగ్గేదేలే అంటున్న స్టార్ హీరోయిన్స్

image

పెళ్లైనా, తల్లిగా ప్రమోషన్ పొందినా కొందరు హీరోయిన్లు వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ మూవీలో శ్రియ శరణ్ మెరిశారు. ది ఇండియా స్టోరీ, ఇండియన్ 3 మూవీలతో కాజల్ అగర్వాల్ బిజీగా ఉన్నారు. మన శంకరవరప్రసాద్ గారు మూవీతో నయనతార మెరవనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 3, కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా, లావణ్య త్రిపాఠి టన్నెల్, సతీ లీలావతి సినిమాలతో కంటిన్యూ అవుతున్నారు.

News September 14, 2025

వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి.. జగ్గారెడ్డికి వినతిపత్రం

image

జీవో నంబర్ 81 ప్రకారం మిగిలిపోయిన వీఆర్‌ఏ వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వీఆర్‌ఏలు ఆదివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇంకా 61 మందికి ఉద్యోగాలు రాలేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని జగ్గారెడ్డి వారికి హామీ ఇచ్చారు.